కఠిన నిర్ణయాలపై జాతికి మన్మోహన్ సంజాయషీ...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21:   దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, అందుకే ఆర్థిక సంస్కరణలు అవసరమయ్యాయని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. శుక్రవారం  రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ పోతున్నాయని,  ఆర్థికంగా ముందడుగు వేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. తమ నిర్ణయాలలో హేతుబద్దత ఉందని చెప్పారు. డబ్బులు చెట్లకు కాయవని,  ఉపాధి కావాలంటే సంస్కరణలు తప్పనిసరి అని అన్నారు. సామాన్య ప్రజలపై భారం వేయాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పారు. సిలిండర్లపై పరిమితి విధించడం వల్ల పేదలపై భారం ఏమీ పడదన్నారు. దేశంలో చాలా మంది ఆరుకంటే తక్కువ సిలిండర్లే వాడుతున్నారని వివరించారు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంకలలోకంటే ఇక్కడ డీజిల్ ధర తక్కువే అని తెలిపారు. డీజిల్ ధర పెంచినా ఇంకా 17 రూపాయల సబ్సిడీ భరిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్కరణలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని భావిస్తున్నామన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు