విదేశీ పర్యాటకులకు సెల్ఫోన్ కనెక్షన్ల పై ఆంక్షలు...
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 2: భారత్ను సందర్శించే విదేశీ పర్యాటకులకు మూడు నెలలకు మించి సెల్ఫోన్ కనెక్షన్లను మంజూరు చేయరాదని టెలికం సర్వీస్ ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సిమ్కార్డుల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈమేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల అమలులోకి వచ్చిన ఈ ఉత్వర్వుల ప్రకారం విదేశీయులు భారత్లో మొబైల్ కనెక్షన్లు పొందేందుకు పాస్పోర్టుతోపాటు చెల్లుబాటులో ఉన్న వీసా పత్రాలను సమర్పించాలి. కాలపరిమితి ముగిసిన వీసాలపై సెల్ కనెక్షన్లు మంజూరు చేయరాదని సర్వీస్ ప్రొవైడర్లను టెలికాంశాఖ ఆదేశించింది. ఒకవేళ వీసా గడువు ఎక్కువగా ఉన్నా విదేశీయులకు మూడు నెలల వ్యవధికి మించి కనెక్షన్లు ఇవ్వరాదని స్పష్టం చేసింది.
Comments