నెక్లెస్ రోడ్‌పై తెలంగాణా మార్చ్




హైదరాబాద్,సెప్టెంబర్ 27: ఆదివారంనాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు నెక్లెస్ రోడ్‌పై తెలంగాణా మార్చ్ నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించింది.  తెలంగాణ మంత్రుల అభ్యర్థన మేరకు తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి రాసిన  లేఖ పై  ప్రభుత్వం ఈ అనుమతి మంజూరు చేసింది. అయితే రెండు రోజుల మార్చ్ కి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. తెలంగాణ మార్చ్ ను శాంతియుతంగా జరుపుతామని జెఎసి హామీ ఇచ్చినట్లు మంత్రి జానారెడ్డి తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు