Saturday, September 29, 2012

ఫిడే చెస్ టోర్నీ చాంపియన్‌గా కోనేరు హంపి

అంకారా (టర్కీ),సెప్టెంబర్ 29:  తెలుగుతేజం కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చివరిదైన 11వ రౌండ్లో గ్రాండ్ మాస్టర్ హంపి పోలెండ్‌కు చెందిన మోనిక సాకోపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.  టోర్నీ ముగిసే సమయానికి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.  ఈ టోర్నీ మొత్తంలో హంపి ఏడు విజయాలు సాధించి, ఓ గేమ్‌లో ఓటమిపాలైంది. మూడు గేమ్‌లు డ్రా చేసుకుంది. ఈ విజయంతో హంపి ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లతోపాటు 40 బోనస్ పాయింట్లు చేరాయి.రూ. 4.43 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మొత్తం 14 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు దక్కించుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...