Thursday, September 27, 2012

బాబు తెలంగాణా లేఖ పై సీమ నేత బైరెడ్డి గరం...పార్టీకి రాం రాం...

హైదరాబాద్,సెప్టెంబర్ 27:  తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని  కానీ రాయలసీమ అంటే చిన్న చూపు ఎందుకని  బైరెడ్డి మండిపడ్డారు. తనకు రాజకీయాల కన్నా రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు అవ్వడానికి రాయలసీమను ఉపయోగించుకుంటున్న నేతలు ఆ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ నాలుగు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 40 రోజులపాటు రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర చేస్తానని ఆయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన అభిమానంతో టిడిపిలో చేరానని, అప్పటి నుండి పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశానని చెప్పారు. నాడు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాటి సిద్ధాంతాల కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఆధ్వర్యంలో పని చేశానని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు ఓకే చెప్పి సీమను నిర్లక్ష్యం చేయడంతో తాను పార్టీలో ఉండదల్చుకోలేదన్నారు. రాయలసీమ ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, ఆత్మాభిమానం కోసం తాను పోరాటం చేస్తానని చెప్పారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...