Saturday, September 22, 2012

అంత వీజీ కాదు-తెలంగాణపై సి.ఎం.

హైదరాబాద్,సెప్టెంబర్ 22:  తెలంగాణపై నిర్ణయం అంత సులభం కాదని,  అడిగితే కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తన అభిప్రాయం చెప్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.అన్నారు తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, వివిధ దశల్లో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఎప్పటిలోగా తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందనేది చెప్పలేనని ఆయన  మీడియాతో అన్నారు. తెలంగాణ మార్చ్ ను వాయిదా వేయించేందుకు వివిధ ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. జీవవైవిధ్య సదస్సును, వినాయక నిమజ్జనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జీవవైవిధ్య సదస్సు దృష్ట్యా తెలంగాణ మార్చ్ ను వాయిదా వేసుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనం కారణంగానే శానససభా సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్‌లో మరోసారి శాసనసభా సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పారు. జీవవైవిధ్య సదస్సు సందర్భంగా 400 కోట్ల రూపాయలతో అక్వేరియం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వంద కోట్ల రూపాయలతో మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని ఆయన చెప్పారు.  విద్యుదుత్పత్తి పెంపునకు  చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సగటున రోజుకు 258 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 181 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. లోటును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులు 26 జీఓలపై రిటైర్డ్ జడ్డితో విచారణ జరిపించాలని కోరారని చెప్పారు. జీఓల జారీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదో అన్నది విచారించాలని అన్నారు. దానిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...