Monday, September 17, 2012

తొలి రోజే సాగని అసెంబ్లీ..

హైదరాబాద్,సెప్టెంబర్ 17:  శాసనసభ సమావేశాల తొలిరోజే వాయిదా పర్వాలతో సాగింది.  విపక్ష సభ్యుల నినాదాలు, వాయిదా తీర్మానం కోసం పట్టుపట్టడంతోఅసెంబ్లీ  దద్దరిల్లింది.  సభ ప్రారంభమైన తొలి అయిదు నిమిషాల్లోనే టీడీపీ, టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దీంతో పట్టుమని పదినిమిషాలు కూడా సాగకుండగా గంటపాటు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. టీఆర్ఎస్ సభ్యుల జై తెలంగాణ నినాదాలతో సభ రెండోసారి అరగంటపాటు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా సభ్యులు తమ పట్టువీడకపోవటంతో స్పీకర్ సభను  మంగళవారానికి వాయిదా వేశారు.
తెలంగాణ తీర్మానం సాధ్యం కాదు:  ముఖ్యమంత్రి
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో మోజార్టీ సభ్యులు సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలేనని అన్నారు. ఒకవేళ తీర్మానం చేసినా వీగిపోవటం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ,అప్పటివరకూ వేచి ఉండాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం భరించే స్థితిలో లేదని ఖరాఖండిగా చెప్పారు. సంవత్సరానికి కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు సరిపోతాయన్నారు. ఎగువ నుంచి నీరు వస్తేనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేది లేదని ముఖ్యమంత్రి తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...