న్యూఢిల్లీ,సెప్టెంబర్ 15: కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జైపాల్ రెడ్డిని నియమించాలని కాంగ్రెసు అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టడంలో భాగంగా వారం లోపే ఈ మార్పులు జరగవచ్చంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి మార్చనున్నట్లు జాతీయ మీడియాకథనం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాయణ రాణేపేరు వినబడుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోనియా గాంధీ పలువురు నాయకులతో చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్లతో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ, మనీష్ తివారీలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు జోతిరాదిత్య, సచిన్ పైలట్లకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రులు గులాం నబీ ఆజాద్, సుబోధ్ కాంత్ సహాయ్, జైశ్వాల్, బేణీ ప్రసాద్ వర్మ, వాయలార్ రవి, జైరాం రమేష్ వంటి సీనియర్లను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వడమా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించడమా అనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రకు ' జైపాల"న ...!
ఆంధ్రకు ' జైపాల"న ...!
No comments:
Post a Comment