మళ్ళీ ‘దూకుడు’ కాంబినేషన్...!
హైదరాబాద్: ‘దూకుడు’ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ సినిమా వచ్చి ఈ ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఒక ప్రకటన చేస్తూ, మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ తో వచ్చే ఏడాది మరో భారీ చిత్రం మొదలుకానుందని తెలియజేశారు. శ్రీనువైట్ల అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ఎన్టీఆర్తో ఆయన చేస్తున్న ‘బాద్షా’ చిత్రం పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని వారు చెప్పారు.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదే సంస్థలో మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం వీరు ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Comments