Wednesday, September 5, 2012

శివకాశీలో భారీ పేలుడు: 52 మంది మృతి

చెన్నై,సెప్టెంబర్ 5:  తమిళనాడులోని శివకాశీలో ఓం శివశక్తి ఫైర్ వర్క్స్ లో  బుధవారం సంభవించిన భారీ పేలుడు లో  52 మంది మృతి చెందగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. శివకాశీ బాణాసంచా తయారీకి పెట్టింది పేరు. ప్రమాదం జరిగిన ఈ ఫ్యాక్టరీ శివకాశీకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సదానందపురం వద్ద ఉంది. దీపావళి పండుగ వస్తున్న సందర్భంగా బాణాసంచా తయారీని ఎక్కువ మందితో, ఎక్కువ మోతాదులో చేపట్టడమే ప్రమాదానికి కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో 45 గదులలో క్రాకర్స్ తయారి  చేస్తున్నారు.  భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని మొదట శివకాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మధు రై ఆసుపత్రికి తరలించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...