లీటరు రు. 5 పెరిగిన డీజిల్ ధర : సిలిండర్లపై సీలింగ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: డీజిల్ ధరను కేంద్ర ప్రభుత్వం లీటరు 5 రూపాయలు పెంచింది. అయితే పెట్రో ధరలు యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. అయితే సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 6 సిలిండర్లు తర్వాత అదనంగా తీసుకునే ప్రతి ఒక్క సిలిండర్ కు రూ.750 చెల్లించాల్సి వుంటుంది.
Comments