ఒలింపిక్స్ లో మనకు మరో రెండు పతకాలు

లండన్ , ఆగస్ట్ 12: లండన్ 2012 ఒలింపిక్స్ లో  భారత్ కు రెండవ రజత పతకం లభించింది. రెజ్లింగ్ ఫైనల్ లో సుశీల్‌ కుమార్ పోరాడి ఓడాడు. జపాన్ రెజ్లర్ తత్సుహిరో యోనెమిత్సుతో విజయం సాధించి బంగారు పతకం గెలుచుకున్నాడు. దీనితో   సుశీల్‌ కుమార్ రజత పతకం తో సరి పెట్టుకోవలసి వచ్చింది.
 రెజ్లింగ్‌లో కాంస్య పతకం
హర్యానా రాష్ట్రానికి చెందిన యోగేశ్వర్ దత్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించారు. పురుషుల 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అతను కాంస్యాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో యోగేశ్వర్ 3-1తో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ మాంగ్ పైన ఘన విజయం సాధించాడు. తొలి రౌండ్లో 0-1తో వెనుకబడిన యోగేశ్వర్ ఆ తర్వాత రెండో రౌండ్లో 1-0తో ఉండి పథకంపై ఆశలు సజీవంగా నిలిపాడు. కీలక మూడో రౌండ్‌లో ఒక్కసారిగా రెచ్చిపోయిన యోగేశ్వర్ కొరియా బాక్సర్‌ని కుప్పకూల్చాడు. పల్టీల మీద పల్టీలు కొట్టించి చివరి రౌండ్‌ను నిమిషంలో ముగించి ఏకంగా ఆరు పాయింట్లు సాధించాడు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు