చివరి వన్డేలోనూ బారత్ గెలుపు
పల్లెకెలె, ఆగస్ట్ 4: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను 4-1 తేడాతో భారత్ గెల్చుకుంది. శనివారమిక్కడ జరిగిన చివరి వన్డేలో లంకపై టీమిండియా 20 పరుగులతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక 45.4 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటయింది. తిరిమానే(77) మెండిస్ (72) అర్థ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. దిండా రెండు వికెట్లు నేలకూల్చాడు. జహీర్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
Comments