Sunday, August 26, 2012

మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం

హైదరాబాద్, ఆగస్ట్ 26:: న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్  ను  ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో  ఓడించింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్  రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకు ఆలౌటయింది. మెక్ కల్లమ్ (52), విలియమ్సన్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు నేల కూల్చాడు. ఓజా మూడు వికెట్లు పడగొట్టాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు, కివీస్ 159 పరుగులు చేసింది. అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో రెండు టెస్ట్ ల సిరీస్ లో ధోనీ సేన 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్ట్ బెంగళూరులో ఈనెల 31న ప్రారంభమవుతుంది.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...