Saturday, August 4, 2012

రాష్ట్రానికి ' గ్యాస్ ' కట్....ఇకపై ఇంకా ' పవర్ ' కటకట

హైదరాబాద్, ఆగస్ట్ 4: మహారాష్ట్రలోని విద్యుత్తును ఉత్పత్తి చేసే రత్నగిరి పవర్ ప్లాంటుకు రసాయన ఎరువుల ప్లాంట్లకు ఇచ్చే 'తొలి ప్రాధాన్యం' ఇవ్వాలని  మంత్రుల కమిటీ  నిర్ణయం తీసుకున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు సంబంధించి రాష్ట్ర కోటా 3.8 ఎంఎంఎస్‌సీఎండి నుంచి ఏకంగా 1.48 ఎంఎంఎస్‌సీఎండీకి తగ్గిపోయింది. ఫలితంగా 400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగనుంది. రిలయన్స్ సంస్థ గ్యాస్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించివేయడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేటాయించిన దానిలో 38 శాతం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. ఎన్టీపీసీకి గ్యాస్‌ను మళ్లించడంతో.. ఇది 33 శాతానికి పడిపోయింది. రత్నగిరి దెబ్బకు ఇది 30 శాతం లోపు తగ్గిపోయింది.  ఇంత తక్కువ ఇంధనంతో సాంకేతికంగా గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేయడం కష్టమవుతుంది. రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు సరఫరా చేసే గ్యాస్‌తో రాష్ట్రానికి 400-500 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతుందని ఓడరేవులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే వాతావరణం సహకరించక రాష్ట్రం భారీ విద్యుత్ కొరతను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ తరలింపు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 3.56 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌లో ప్రస్తుతం 1.36 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే అందుతోందని, మిగతా గ్యాస్‌ను కూడా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఇంతవరకు కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే స్వరాష్ట్రం మహారాష్ట్ర పై ప్రేమ వల్లే రత్నగిరి పవర్ ప్లాంటుకు మహర్దశ పట్టిందని అంటున్నారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...