Sunday, August 19, 2012

యువరాజ్ సింగ్ కు అర్జున అవార్డ్..

న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: ఒలంపిక్ క్రీడల్లో భారత్ కు పతకాలు సాధించిన షూటర్ విజయ్ కుమార్, కుస్తీ వీరుడు యోగేశ్వర్ దత్ కు దేశ అత్యున్నత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. క్రీడల్లో విశేష ప్రతిభ చూపిన మరో 25 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు లను కూడా కేంద్ర క్రీడాశాఖ ప్రకటించింది. క్యాన్సర్ వ్యాధిని ఎదురించి మళ్లీ క్రికెట్ కు సేవలందించేందుకు సిద్ధ పడుతున్న యువరాజ్ సింగ్ తో పాటు దీపిక కుమారి, లైష్రామ్ బంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవిత రాందాస్ రావత్ (అథ్లెటిక్స్), అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్ (బాడ్మింటన్), ఆదిత్య ఎస్ మెహతా (బిలియర్డ్స్), వికాస్ క్రిష్ణన్ (బాక్సింగ్), సర్దార్ సింగ్ (హాకీ), యశ్పాల్ సోలంకి (జూడో), అనుప కుమార్ (కబాడీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్ను రాజ్ సింగ్ (షూటింగ్), ఓంకార్ సింగ్ , జయదీప్ కర్మాకార్ (షూటింగ్), దీపికా పల్లికాల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్ లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీతా పోగట్ (రెజ్లింగ్), భీమల్జీత్ సింగ్ (వుషు) దీపికా మల్లిక్, రామ కరణ్ సింగ్ (అథ్లెటిక్ పారలింపిక్స్) లకు అర్జున అవార్డు లను ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...