మేరీకామ్ కు కాంస్య పతకం
లండన్, ఆగస్ట్ 8: భారత్ ఐరన్ లెడీగా పేరు గాంచిన మహిళా బాక్సర్ మేరీకామ్ 51 కేజీల ఫ్లై వెయిట్ సెమీ ఫైనల్స్ లో బ్రిటన్ బాక్సర్ నికోల్ ఆడమ్స్తో చేతిలో పరాజయం పాలైంది. 51 కేజీల ఫ్లై వెయిట్లో పోటీపడుతున్నఆమె రెండో సీడ్ ఆడమ్స్తో 11-6 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత చరిత్రలోనే కాంస్య పతకం అందుకున్న తొలి బాక్సర్గా మేరీ రికార్డ్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో నికోల్ ఆడంస్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. లండన్ ఒలంపిక్స్ నింబంధనల ప్రకారం మేరీకి కాంస్య పతకం దక్కింది.మేరీకామ్ సాధించిన ఈ మెడల్ తో లండన్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. దీంతో ఒలింపిక్స్ లో భారత రికార్డు మెరుగయింది. బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ మూడు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు కాంస్యాలున్నాయి.

Comments