Thursday, August 2, 2012

రాజకీయ ప్రత్యామ్నాయంపై అన్నా హజారే దృష్టి...

న్యూఢిల్లీ,ఆగస్ట్ 2: సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం కీలక మలుపు తిరిగింది. తన మద్దతుదారులతో  రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అన్నా హజారే  ఉన్నట్లు అర్థమవుతోంది.తాను స్వయంగా రాజకీయాల్లో పాల్గొనబోనని, అయితే రాజకీయ ప్రత్యామ్నాయానికి మద్దతు ఇస్తానని అయన చెప్పారు. ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చవేర్చడంలో తప్పు లేదని ఆయన అన్నారు. అన్నా హజారీ దీక్ష గురువారం ఐదో రోజుకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష విరమించనుంది. దేశంలో మార్పునకు రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమైతే దాన్ని పూరించాల్సిందేనని ఆయన అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలని ఆయన అన్నారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చని నాయకులను అధికారం నుంచి దించేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటుకు సరైన వ్యక్తులు ఎన్నిక కావడానికి రాజకీయ పార్టీ ఏర్పాటు మాత్రమే ప్రత్యామ్నాయం అయితే అందుకు సిద్ధపడడంలో తప్పు లేదని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న అన్నా హజారే చుట్టూ వేలాది మంది మద్దతుదారులు చేరారు. ఆయన కుడిచేయి మణికట్టు రాఖీలతో నిండిపోయింది. పార్టీని ఏర్పాటు చేయాలా అనే విషయంపై 48 గంటల్లో సమాచారం అందించాలని ఆయన తన అనుచరులకు సూచించారు. అన్నా అసలు రంగు బయటపడిందని కాంగ్రెసు నేత అంబికా సోనీ విమర్శించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...