లండన్, ఆగస్ట్ 6: ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి, వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ మెరుపులు మెరిపించింది. భారతదేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. బాక్సింగ్లో మహిళల ఫ్లై 51 కెజీల కేటగిరీలో ఆమె సెమీ ఫైనల్ కు చేరుకుంది.మేరీ కోమ్ టునీషియాకు చెందిన మరోవా రహాలీని 15-6 స్కోరుతో క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. అంతకుముందు తొలి రౌండ్లో పోలాండ్ బాక్సర్ను చిత్తుకింద కొట్టి 19-14తో గెలిచిన మేరీ కామ్...క్వార్టర్ఫైనల్ ఫైట్ లోనూ చెలరేగింది. పవర్ పంచ్లతో ప్రత్యర్థి మరోవాను అదరగొట్టి సెమీస్లోకి ఎంటరై, భారత్కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. 29 ఏళ్ళ మేరి కోమ్ ఇంతవరకు అయిదుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment