Sunday, August 5, 2012

విలియమ్స్ సిస్టర్స్ కు ఒలింపిక్స్ 'డబుల్'

లండన్, ఆగస్ట్ 5:  అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్ ఒలింపిక్స్ లో రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్ లో నాలుగేసి స్వర్ణ పతకాలు గెలిచిన ఖ్యాతిని అక్కాచెళ్లెలిద్దరూ దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన తుది పోరులో చెక్ రిపబ్లిక్ జోడి ఆండ్రియా, లూసియాను 6-4, 6-4తో వీనస్, సెరెనా విలియమ్స్ ఓడించి టైటిల్ గెలిచారు. సిడ్నీ, బీజింగ్ ఒలింపిక్స్ లో వీరు టైటిల్స్ సాధించారు.
100 మీటర్ల స్ప్రింట్‌లో ఫ్రాజర్‌ కు స్వర్ణం
మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో జమైకా స్టార్‌ ఫ్రాజర్‌ ప్రైస్‌ సంచలనం సృష్టించింది. 10.75 సెకెన్లలో గమ్యం చేరుకుని స్వర్ణ పతకం గెల్చుకుంది. అమెరికా అథ్లెట్‌ జెటర్‌, జమైనా రన్నర్‌ కాంప్‌బెల్‌ బ్రౌన్‌ రజత, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 1992, 1996లో గెయిల్‌ డెవర్స్స్‌ తర్వాత ఒలింపిక్స్లో 100 మీటర్ల టైటిల్‌ను నిలబెట్టుకున్న అథ్లెట్‌గా ఫ్రాజర్‌ రికార్డుల్లోకి ఎక్కింది.
క్వార్టర్ ఫైనల్లో మేరీకామ్
భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకామ్ ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల ప్లయ్ వెయిట్ 51 కేజీల విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పోలెండ్ బాక్సర్ కరోలినా మైకాల్ జుక్ ను 19-14తో ఓడించింది.
వైదొలగిన మనోజ్ కుమార్
భారత బాక్సర్ మనోజ్ కుమార్ వివాదస్పదరీతిలో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. 64 విభాగంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ గేమ్ లో అతడు బ్రిటన్ బాక్సర్ థామస్ స్టాకర్ చేతిలో 20-16 తేడితో ఓడిపోయినట్టు జడ్జిలు ప్రకటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...