న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల ప్రతిపక్షాలపై దూకుడు పెంచారు. పార్లమెంటు సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలను ముందుండి నడిపిస్తూ.. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటీవల ‘కాగ్’ బయటపెట్టిన బొగ్గు కుంభకోణాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ పార్లమెంటులో యూపీఏను ఇరుకున పడేస్తున్న నేపథ్యంలో.. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె బీజేపీ పై యుద్ధం ప్రకటించారు. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీపై పార్టీ ఎంపీలు ఎదురుదాడి చేయాలని ఆమె ఆదేశాలిచ్చారు. ‘‘బొగ్గు కుంభకోణం పేరుతో ప్రధాని మన్మోహన్ సింగ్ను లక్ష్యం చేసుకుని బీజేపీ దాడి చేస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. ప్రధాని ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ బీజేపీ.. సమావేశాలను అడ్డుకుంటోంది. బీజేపీ దీన్ని ఒక అలవాటుగా చేసుకుంది. కాగ్ నివేదిక లేదా ఏ ఇతర సమస్యపై నైనా సరే చర్చించడానికి ప్రభుత్వంగాని, ప్రధాని మన్మోహన్ గాని సదా సిద్ధంగా ఉన్నారని సోనియా స్పష్టంచేశారు. సజావుగా సాగే సభలోనే ఈ చర్చలకు అవకాశముంటుందని, కానీ బ్లాక్మెయిల్కు గురయ్యే సభలోకాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బ్లాక్మెయిలింగ్ను బీజేపీ మిత్రపక్షాలే సహించడం లేదని అన్నారు. ‘‘ఎన్నికలకుఎక్కువ సమయం వెచ్చించాల్సిన దశలోకి మనం అడుగిడుతున్నాం’’ అంటూ రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే కృషి చేయాల్సి ఉందని కార్యకర్తలకు సూచించారు. అస్సాం అల్లర్లు, దేశంలో వర్షాభావం, ఆర్థిక మందగమనం లాంటి ఎన్నో సమస్యలున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి పార్లమెంటు సమావేశాల్లో తగిన సూచనలు చేయాల్సిన బీజేపీ ఆ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటోందంటూ విరుచుకుపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment