లక్ష్మణ్, ద్రావిడ్ లేకుండా నేటినుంచి బారత్-న్యూజిలాండ్ టెస్ట్
హైదరాబాద్ , ఆగస్ట్ 22: న్యూజిలాండ్, భారత జట్ల మధ్య గురువారం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐదురోజులపాటు జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల నుంచి స్పందన కరువైంది. హైదరాబాదీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మ్ కారణంగా టెస్ట్ దూరం కావడంతో అభిమానుల టెస్ట్ మ్యాచ్ పై ఆసక్తి కనబరచడం లేదంటున్నారు. మొత్తం 39 వేల సీట్ల సామర్ధ్యం ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో కేవలం 2500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయనట్టు హెచ్ సీఏ వర్గాలు వెల్లడించాయి. లక్ష్మణ్ మ్యాచ్ దూరం కావడంతో అభిమానుల స్పందన చాలా తక్కువగా ఉందని హెచ్ సీఏ కార్యనిర్వాహక సభ్యుడు గెరార్డ్ కార్ తెలిపారు గురువారం ఉ.9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్లు లేకుండా 16 సంవత్సరాల తర్వాత టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ ప్రకటించగా.. గత శనివారం వివిఎస్ లక్ష్మణ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గోల్డెన్ జనరేషన్ గా బావించే భారత బ్యాట్స్ మెన్ లో ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే మిగిలి ఉన్నాడు.రాహుల్, లక్ష్మణ్లు భర్తీ చేయలేని గొప్ప బ్యాట్స్ మెన్లని వీరిని మిస్ అవుతున్నామని సచిన్ అన్నాడు.
హైదరాబాద్ , ఆగస్ట్ 22: న్యూజిలాండ్, భారత జట్ల మధ్య గురువారం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐదురోజులపాటు జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల నుంచి స్పందన కరువైంది. హైదరాబాదీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మ్ కారణంగా టెస్ట్ దూరం కావడంతో అభిమానుల టెస్ట్ మ్యాచ్ పై ఆసక్తి కనబరచడం లేదంటున్నారు. మొత్తం 39 వేల సీట్ల సామర్ధ్యం ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో కేవలం 2500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయనట్టు హెచ్ సీఏ వర్గాలు వెల్లడించాయి. లక్ష్మణ్ మ్యాచ్ దూరం కావడంతో అభిమానుల స్పందన చాలా తక్కువగా ఉందని హెచ్ సీఏ కార్యనిర్వాహక సభ్యుడు గెరార్డ్ కార్ తెలిపారు గురువారం ఉ.9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్లు లేకుండా 16 సంవత్సరాల తర్వాత టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ ప్రకటించగా.. గత శనివారం వివిఎస్ లక్ష్మణ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గోల్డెన్ జనరేషన్ గా బావించే భారత బ్యాట్స్ మెన్ లో ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే మిగిలి ఉన్నాడు.రాహుల్, లక్ష్మణ్లు భర్తీ చేయలేని గొప్ప బ్యాట్స్ మెన్లని వీరిని మిస్ అవుతున్నామని సచిన్ అన్నాడు.
No comments:
Post a Comment