న్యూఢిల్లీ,ఆగస్ట్ 31: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత కాశీరాం రాణా (76) శుక్రవారమిక్కడ అనారోగ్యంతో మృతిచెందారు. ఉదయం ఛాతీ నొప్పి రావడంతో ఆయనను స్థానిక జివేరాజ్ మెహతా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే చనిపోయారు. రాణా సూరత్ నుంచి ఆరుసార్లు వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు. వాజపేయి ప్రభుత్వంలో (1998-2004) జౌళి, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం ఆయ్యాక రాణా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీలో ఆయన ఇటీవలే చేరి ఎన్నికల ప్రచారం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment