సైనా నెహ్వాల్ కు కాంస్యం

లండన్,ఆగస్ట్ 4:  ఒలింపిక్స్ లో భారత్ కు మూడవ పతకం లభించింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలిచింది. చైనాకు చెందిన ప్రత్యర్థి వాంగ్ జిన్ గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది.
వికాస్ కృష్ణన్‌ నిస్క్రమణ
 బాక్సింగ్ విభాగంలో  ప్రీ క్వార్టర్ ఫైనల్లో గెలిచి ఫైనల్స్కు చేరుకున్న  భారత క్రీడాకారుడు వికాస్ కృష్ణన్‌కు ఆ  ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ప్రత్యర్థి జట్టు అమెరికా ఫిర్యాదుతో బాక్సింగ్ అసోసియేషన్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ ఫలితాలను తిరిగి సమీక్షించింది. ఈ సమీక్ష అనంతరం అమెరికా క్రీడాకారుడికి అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించింది. దీంతో వికాస్ కృష్ణన్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
35వ స్థానంలో భారత్
ఒలింపిక్‌ పతకాల పట్టికలో  అమెరికా 21 స్వర్ణాలతో సహా 43 పతకాలు అగ్రస్థానంలో ఉండగా,  చైనా 20 స్వర్ణాలతో సహా 42 పతకాలతో రెండో స్థానంలోకి దిగిపోయింది. మిగతా స్థానాల్లో దక్షిణ కొరియా, బ్రిటన్‌, ఫ్రాన్స్ , జర్మనీ, ఇటలీ, ఉత్తర కొరియా, కజఖస్తాన్‌ వున్నాయి. ఇక ఒక రజతం, ఒక కాంస్యం సాధించిన భారత్‌ ప్రస్తుతానికి 35వ స్థానంలో వుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు