హైదరాబాద్ లో ' ఆటో ' బాదుడు...
హైదరాబాద్ ,ఆగస్ట్ 14: జంటనగరాలలో ఆటో ఛార్జీలు పెరిగాయి. మీటర్ పై కనీస ఛార్జీని 14 నుంచి 16 రూపాయలు పెంచారు. కిలో మీటర్ కు మీటర్ ఛార్జీని 8 నుంచి 9 రూపాయి పెంచారు. 21 వతేదీ అర్ధరాత్రి నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయి. మూడు నెలల్లోగా కొత్త మీటర్లను సవరించుకోవాలని రవాణశాఖ ఆదేశాలు జారీ చేసింది. జంటనగరాలలో ఆటో ఛార్జీలు కనీసం రెండేళ్ళ వ్యవదిలో మీటర్ పై కనీసం రెండు రూపాయలు పెరగడం ఆనవాయితీగా వస్తోంది..పైగా అడ్డదారి దోపిడీ తప్పదు. ప్రభుత్వం కూడా వారితో లాలూచీ పడ్డమే తప్ప ప్రజల బాధలు పట్టవు...ఇక మళ్ళీ బస్సు చార్జీల బాదుడు కోసం సిద్దంగా ఉండాల్సిందే...
Comments