హైదరాబాద్,,ఆగస్ట్ 24: హైదరాబాద్లో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలిటెస్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 307 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు సెంచరీ సాధించిన ఛటేశ్వర పూజారా లంచ్ సమయం తర్వాత 159 పరుగులు చేసి పెవిలియన్కు చేరగా.. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రవిచంద్రన్ అశ్విన్ 37, ప్రజ్ఞాన్ ఓజా 4, ఉమేష్ యాదవ్ 4, జహీర్ ఖాన్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ ధోనీ 147 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ను టీమిండియా స్పిన్నర్స్ రవిచంద్రన్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా కుప్పకూల్చారు. న్యూజిలాండ్ ఓపెనర్లు మెక్ కల్లమ్ 22, విలియమ్సన్ 32 పరుగులకే ప్రజ్ఞాన్ ఓజా పెవిలియన్కు పంపగా.. గుప్తిల్ 2, రాస్ టేలర్ 2, ఫ్లిన్ 16 పరుగులకే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్ తీసుకోగా, ప్రజ్ఞాన్ ఓజా 2 వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సయమానికి ఫ్రాంక్లిన్ 31, వ్యాన్ వేక్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఫాలోఆన్ నుండి తప్పించుకోవాలంటే ఇంకా 133 పరుగులు చేయాల్సి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment