Wednesday, August 15, 2012

ఘనంగా పంద్రాగష్టు..' .మీసేవలు ' పెంచుతామన్న సి.ఎం.

హైదరాబాద్,ఆగస్ట్ 15: : ఉపాధి హామీ పధకం అమలులో  మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్శ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ...  పేద ప్రజల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. మహిళల్లో సాధికారికత తీసుకు వచ్చేందుకు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. యువత కోసం రాజీవ్ యువకిరణాలు ప్రారంభించామని, మూడేళ్లలో 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది యువకులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. గుడిసె లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని, అందులో భాగంగా ఇప్పటికే 8 లక్షల మందికి 2004 నుండి తమ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, ఇంకా నాలుగు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.3500 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించామని, 2008 నుంచి రూ.5,300 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను  బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.   గ్యాస్ సరఫరా తగ్గటం, జల విద్యుత్ ఉత్పత్తి తగ్గటంతో విద్యుత్ సమస్యలు పెరిగాయన్నారు. 'మీ సేవ'లో అందిస్తున్న 34 సేవలను 100 కు పెంచుతామని సీఎం తెలిపారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదాకు కృషి చేస్తున్నట్లు కిరణ్ వెల్లడించారు. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతి సాంస్కృతి శాఖ శకటానికి, రెండో బహుమతి డెయిరీ డెవలప్‌మెంట్ శకటానికి, మూడో బహుమతి పర్యాటక శకటానికి వచ్చింది. అటవీ శాఖ శకటానికి కన్సోలేషన్ బహుమతి వచ్చింది. వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు  స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...