Saturday, August 25, 2012

టి.టి.డి. చైర్మన్ గా మళ్ళీ బాపిరాజు

హైదరాబాద్, ఆగస్ట్ 25:  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధ్యక్ష బాధ్యత పార్లమెంట్ సభ్యుడు కనుమూరి బాపిరాజుకు మరోసారి దక్కింది. కనుమూరి బాపిరాజు చైర్మన్‌గా.. మరో 13 మంది సభ్యులుగా పూర్తిస్థాయి పాలకమండలిని ప్రభుత్వం నియమిచింది.  వీరు ఈ పదవుల్లో రెండేళ్ల పాటు కొనసాగుతారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు మళ్లీ నిరాశే మిగిలింది. టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఉన్న మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావుకు ఈసారి అవకాశం లభించలేదు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరికి మరోసారి బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించారు. ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే కండ్రు కమల, మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్, జి.వి.శ్రీనాథ్‌రెడ్డి, చిట్టూరి రవీంద్రలతో పాటు ఎల్.ఆర్.శివప్రసాద్, చెన్నైకి చెందిన కన్నయ్య (రైల్వే మజ్దూర్ సంఘం అధ్యక్షుడు), రఘునాథ్‌విశ్వనాథ్ దేశ్‌పాండే, సి.హెచ్.లక్ష్మణరావు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్, దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య, టీటీడీ ఈవో ఎల్.వి.సుబ్రమణ్యంలు పాలకమండలి సభ్యులుగా కొనసాగుతారు. ముత్యంరెడ్డి స్థానంలో ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డిని బోర్డు సభ్యునిగా నియమించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...