కాల్పులతో వణికిన న్యూజెర్సీ: ముగ్గురి మృతి
నూజెర్సీ, ఆగస్ట్ 31: తరచు కాల్పుల సంఘటనలు అమెరికాను అట్టుడికిస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీలో ఒక సూపర్ మార్కెట్ లో ఒక ఆగంతకుడు జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా, పోలీసులు ఆ దుండగుని కాల్చి చంపారు. ఉద్యోగులు పనిచేస్తుండగా సాయుధుడు పథక్మార్క్ షాపింగ్ సెంటర్లో కాల్పులకు దిగినట్లు సమాచారం. వెంటనే భద్రతా బలగాలు షాపింగ్ సెంటర్ను చుట్టుముట్టారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనల్లో ఇది నాలుగవది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వద్ద వారం రోజుల క్రితమే ఇటువంటి సంఘటన జరిగింది. ఆగస్టు 5వ తేదీన మైఖెల్ వాడే పేజ్ విస్కాన్సిన్లో గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Comments