లండన్, ఆగస్ట్ 3: ఒలింపిక్స్ లో భారత్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్ లో పరాజయం పాలయింది. , వెంబ్లీ ఎరీనాలో జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్స్ లో సైనా నెహ్వాల్, చైనాకు చెందిన వాంగ్ ఇహాన్ చేతిలో 21-13 తో ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ ఓటమితో సైనా నెహ్వాల్ వరుసగా ఆరు సార్లు వాంగ్ ఇహాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఇక కాంస్య పతకం కోసం సైనా శనివారం వాంగ్ జిన్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
రాపిడ్ ఫైర్ పిస్టల్ లో భారత్ కు రజత పతకం
ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ లో విజయకుమార్ రజత పతకం గెలుచుకున్నాడు. 585 పాయింట్లతో విజయకుమార్ ఈ పతకం సాధించాడు. కాగా, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో జాయ్ దీప్ కర్మాకర్ 0.9 పాయిట్ల తేడాతో కాంస్యపతకం చేజార్చుకున్నారు.
రాపిడ్ ఫైర్ పిస్టల్ లో భారత్ కు రజత పతకం
ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ లో విజయకుమార్ రజత పతకం గెలుచుకున్నాడు. 585 పాయింట్లతో విజయకుమార్ ఈ పతకం సాధించాడు. కాగా, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో జాయ్ దీప్ కర్మాకర్ 0.9 పాయిట్ల తేడాతో కాంస్యపతకం చేజార్చుకున్నారు.
No comments:
Post a Comment