Wednesday, August 29, 2012

కసబ్ ఉరిశిక్షను సమర్ధించిన సుప్రింకోర్టు

న్యూఢిల్లీ,ఆగస్ట్ 29: 2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని సుప్రీం కోర్టు  తీర్పు ఇచ్చింది. కసబ్ పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీం కోర్టు బుదవారం  తీర్పు ఇచ్చింది. కసబ్ వంటి ఉగ్రవాదులకు ఒక్క ఉరి తప్ప మరో శిక్ష లేదని , న్యాయవాదిని నియమించలేదన్న సాకుతో కసబ్ మినహాయింపు పొందలేడని, భారతదేశంపైకి దాడికి తెగబడటం కసబ్ చేసిన పెద్ద తప్పు అని సుప్రీం పేర్కొంది. రెండేళ్ల క్రితం కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. 2008లో ముంబయి ఉగ్రవాదుల దాడి ఘటనలో కసబ్ తప్ప మిగిలిన ఉగ్రవాదులు అందరూ మరణించారు.  ముంబయి దాడుల ఘటనలో 166 మంది మృతి చెందారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...