హైదరాబాద్,ఆగస్ట్ 8: సత్యం కేసులో రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిసేషన్ (సిబిఐ )కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చింది. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది. అటాచ్మెంట్కు కోర్టు అనుమతివ్వడంతో ఇక తదుపరి కార్యాచరణకు సిబిఐ సిద్ధమవుతోంది. కాగా ,రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్ల కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ప్రమోటర్లకు చెందిన ఆస్తుల విలువ 2.48 కోట్ల రూపాయల మేర ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 44 రకాల ఆస్తుల జప్తునకు అనుమతి ఇస్తూ ము ఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఫైల్పై సంతకం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment