పార్లమెంట్‌ను వదలని ' బొగ్గు ' మంట...

న్యూఢిల్లీ,ఆగస్ట్ 23:  బొగ్గు కేటాయింపుల కుంభకోణం వరుసగా మూడో రోజు గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్న బీజేపీ  ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే అదే ధోరణి కొనసాగించింది. రెండు సభలలో విపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.గందరగోళం మధ్య మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడిన ఉబయ సబలూ తర్వాత శుక్రవారానికి వాయిదా పడ్డాయి. మరో వైపు  ప్రతిష్టంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యసభ సజావుగా సాగేందుకు వీలుగా అటు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా అన్ని పార్టీలతో భేటీ అయ్యారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు