న్యూఢిల్లీ, ఆగస్ట్ 22: ఈసారి తన పుట్టిన రోజుకు ప్రత్యేకత ఏమీ లేదని, ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. తన భవిష్యత్తు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారని, పదవులు వారే ఇస్తారని ఆయన అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని కొంత మంది అంటున్నారంటే అది వారు తన పట్ల అభిమానాన్ని చాటుకోవడమేనని, తనను ముఖ్యమంత్రిగా చూడాలని వారు కోరుకుంటున్నట్టుగా అనుకోవాలని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని ఆయన అన్నారు. సమిష్టి కృషి ఉంటే 2014లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసు మహా వృక్షం లాంటిందని, శాశ్వతంగా ఉండే పార్టి అని, పార్టీ ఉంటుందా ఉండదా అనే మీమాంస అక్కరలేదని ఆయన అన్నారు.రజా సమస్యలు ఒక్క రోజులో పోవని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూ పోవాలని ఆయన అన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరిస్తే కొత్త సమస్యలు వచ్చి పడతాయని, అప్పుడు వాటిని పరిష్కరించాల్సి ఉంటుందని, సమస్యల పరిష్కారమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. అభిమానులకు కాస్తా దూరమవుతున్నా ప్రజలకు దగ్గర అవుతున్నాననే సంతృప్తి ఉందని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment