అమెరికాలో గురుద్వారాలో కాల్పులు--ఏడుగురి మృతి

న్యూయార్క్,ఆగస్ట్ 5: అమెరికాలో విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలోని ఓక్ క్రీక్ వద్ద గురుద్వారాలో ఆదివారం  ఉదయం ప్రార్థనల సమయంలో  కొందరు ఆగంతకులు  విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో  ఏడుగురు మృతిచెందగా ఓ పోలీసు అధికారి సహా కనీసం 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురుద్వారలో మొత్తం ముగ్గురు దుండగులు ఉన్నారని భావిస్తుండగా వీరిలో ఒకరు పోలీసు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. తెల్లజాతికి చెందిన బట్టతల గల భారీకాయుడొక డు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దుండగుడు స్లీవ్‌లెస్ టీ షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ గురుద్వారను ఆరేడేళ్ల క్రితం  నిర్మించారు. కాగా ఆదివారం ఇక్కడ ప్రసంగించేందుకు భారత్ నుంచి ప్రత్యేకంగా ఓ సిక్కు మతబోధకుడు వచ్చారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు