Monday, August 6, 2012

అంగారక గ్రహంపై దిగిన 'క్యూరియాసిటీ రోవర్'

వాషింగ్టన్,ఆగస్ట్ 6:   నాసా ప్రయోగించిన 'క్యూరియాసిటీ రోవర్'  విజయవంతంగా అంగారక గ్రహంపై దిగింది. దీంతో నాసాలో శాస్త్రవేత్తలు సంబరాలు అంబరాన్నంటాయి. అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను రోవర్ పసిగట్టనుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన క్యూరియాసిటీ రోవర్ 2011 నవంబరు 26న భూమి నుంచి బయలుదేరింది.  దీని ప్రయోగానికి అయిన ఖర్చు 13,700 కోట్ల రూపాయలు. ఈ ప్రయోగం చాలా క్లిష్టమైందని నాసా పేర్కొంది. ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. ఈ రోవర్ అంగారక గ్రహంపై దిగడం సులభమేమీ కాదు. గంటకు దాదాపు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే వ్యోమనోకను కేవలం ఏడు నిమషాలలోనే అరుణ గ్రహం పైకి సురక్షితంగా దించాలి. ఈ ప్రక్రియ విజయవంతమైంది. క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై రెండేళ్ల పాటు పరిశోధన చేయనుంది. అక్కడి నుండి ఫోటోలు పంపిస్తుంది. ఈ రోవర్ 1540 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి అంగారకుడిపై దిగింది. ఇప్పటి వరకు నాసా శాస్త్రవేత్తలు కేవలం తక్కువ బరువు ఉండే రోవర్‌లను పంపించారు. అవి కూడా కేవలం మూడు నెలలు మాత్రమే అక్కడ పని చేసేవి. కానీ ఈ క్యూరియాసిటీ మాత్రం అందుకు విభిన్నం. ఇది 900 కిలోల బరువైనదే కాకుండా.. రెండు సంవత్సరాల పాటు పని చేస్తుంది. దీనిని అంగారకుడి పైకి ప్రయోగించే ముందు శాస్త్రవేత్తలు అంగారకుడి తరహా వాతావరణాన్ని భూమి మీద సృష్టించి దానిని పరీక్షించారు. ఆ తర్వాతే ప్రయోగించారు. కాగా ఈ తరహా ప్రయోగాలకు భారత ప్రభుత్వం కూడా ఇస్రోకు అనుమతి ఇచ్చింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...