Monday, August 27, 2012

శీను వైట్ల, రాంచరణ్ లతో వైజయంతి సినిమా..

హైదరాబాద్:  వైజయంతీ మూవీస్ సంస్థ ద్వారా  ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత సి.అశ్వనీదత్ రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో భారీ చిత్ర నిర్మణనికి సన్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ సినిమాను మలచడానికి దర్శకుడు శ్రీను వైట్ల కృషి చేస్తున్నారుట. రామ్‌చరణ్ ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్’, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘ఎవడు’, బాలీవుడ్ ‘జంజీర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవి క్ట్‌లు పూర్తవగానే వైజయంతి  సినిమా మొదలవుతుందంటున్నారు. కాగా, ప్రస్తుతం వైజయంతీ సంస్థ రవితేజ హీరోగా నిర్మిస్తున్న  ‘సారొస్తారు’ చిత్రం  పరశురాం  దర్శకత్వంలో రూపొందుతోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...