అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మణ్ గుడ్‌ బై

హైదరాబాద్,ఆగస్ట్ 18:   భారత్ తరఫున  అంతర్జాతీయ క్రికెట్లో 16 సంవత్సరాల పాటు సేవలందించిన హైదరాబాదీ  స్టైలిష్‌ బ్యాట్శ్ వివిఎస్ లక్ష్మణ్  రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ కు ఇది సరైన సమయమని భావిస్తున్నానని లక్ష్మణ్ తెలిపాడు. జూనియర్లకు అడ్డుగా ఉండకూడదని, వారికి అవకాశం కల్పించాలని భావించి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనితో హైదరాబాదులో న్యూజిలాండ్‌తో ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టు  లో కూడా  లక్ష్మణ్‌ ఆడనట్టే. 16 ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందింనందుకు గర్వంగా ఉందన్నాడు. క్రికెట్ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించిందన్నారు. హైదరాబాద్ క్రికెటర్లకు తన అనుభవాన్ని పంచుతానని ఆయన చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్ క్రికెట్‌లో ఆడతానని ఆయన చెప్పారు.  క్రీడాజీవితంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హెచ్ సీఏకు కృతజ్ఞతలు చెప్పాడు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు