Thursday, August 16, 2012

నటి టి.జి.కమలాదేవి మృతి

చెన్నయ్,ఆగస్ట్ 16:  అలనాటి సినీ నటి టి.జి.కమలాదేవి (84) గురువారం కన్నుమూశారు. ఆమె దాదాపు 70 చిత్రాలకు పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. కమలాదేవి అసలు పేరు గోవిందమ్మ. 1930, డిసెంబర్ 29న జన్మించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయనిగా, నటిగా కమలాదేవి తనదైన ముద్ర వేసుకున్నారు. బాలనాగమ్మ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, గుణ సుందరి కథ, కథానాయకుడు, ఇల్లరికం తోడుదొంగలు, పల్లెటూరు, చక్రపాణి, వెలుగు నీడలు, భక్త రాందాసు, బంగారు పంజరం, కంచుకోట, పెత్తందార్లు, అభిమానవతి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.నాటకాలలో  అలెగ్జాండర్ పాత్ర కమలాదేవికి  గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆమెను నాటక కళాపూర్ణ అవార్డుతో సత్కరించింది. కమలదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గా కూడా సేలందించారు. సినిమాలతో పాటు క్రీడల్లో కమలాదేవి రాణించారు. బిలియర్డ్స్ క్రీడలో ఆమె  ఆమె రెండు సార్లు జాతీయ చాంపియన్ షిప్ గెలుచుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...