Tuesday, August 14, 2012

విలాస్ రావు కన్నుమూత

చెన్నై,ఆగస్ట్ 14: : కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మహారాష్ట్రకు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మహారాష్ట్రలోని లాతూరు జిల్లా బభల్ గావ్ లో మే 26, 1945లో విలాస్ రావ్ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వైశాలిని ఆయన వివాహం చేసుకున్నారు. పుణె యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్ బి పట్టాలు పుచ్చుకున్నారు. మహారాష్ట్రకు 1999-2003, 2004-2008లో రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 2008 ముంబై దాడులతో సీఎం పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు అమిత్, రితేష్, ధీరజ్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. అమిత్ ఎమ్మెల్యేగా ఉండగా, రితేష్ బాలీవుడ్ నటుడిగా ఉన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...