Tuesday, August 7, 2012

ఆంధ్రకు ఊరట- రత్నగిరికి గ్యాస్ సరఫరా నిలిపివేత

న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7:  ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్ కు కేటాయించిన గ్యాస్ సరఫరాను నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ప్రధాని కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఆ రాష్ట్రానికే చెందాలని పేర్కొంది. రధాని ఆదేశాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే కాకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు, కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి కూడా ఊరట లభించింది. గ్యాస్ మళ్లింపుపై ప్రతిపక్షాల కేంద్ర ప్రభుత్వంపైనే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, జైపాల్ రెడ్డిపై, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్షాల ఒత్తిడి, అధికార పక్షంలోని ఓ వర్గం వ్యాఖ్యలతో తీవ్రమైన ఒత్తిడికి గురైన ముఖ్యమంత్రి గ్యాస్ మళ్లింపుపై సోమవారం విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో చర్చించారు. ఆ తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‍‌ను కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తికి ప్రధాని కార్యాలయం నుంచి వెంటనే సానుకూల స్పందన రావడమే కాకుండా ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...