న్యూఢిల్లీ,ఆగస్ట్ 11: రాహుల్ గాంధీని ప్రభుత్వంలోకి అహ్వానించడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రభుత్వంలోనూ కాంగ్రెసు పార్టీలోనూ పెద్ద పాత్ర పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో ప్రదాని శనివారం ఈ వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీని ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తున్నట్లు తాను ఎప్పుడూ చెబుతునే ఉన్నట్లు ఆయన మీడియాకు గుర్తు చేశారు. తాను పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను ఏ విధమైన పాత్ర నిర్వహించాలనేది పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ గత నెలలో అన్నారు. కాగా, సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టడంతో ఖాళీ అయిన ఆ పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కొంత మంది సోనియా గాంధీని కోరారు. అయితే, ఆ పదవిని హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చారు. ప్రణబ్ నిర్వహించిన ఆర్థిక శాఖను పి. చిదంబరానికి అప్పగించారు. అయితే, వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని ,ఈ పునర్వ్యస్థీకరణలో రాహుల్ గాంధీకి మంత్రి పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment