వాషింగ్టన్,ఆగస్ట్ 11: అమెరికాలోని ఒక్లహోమా నగరంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ మలుపు వద్ద అదుపు తప్పి మరో రోడ్డులో వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొందని, ఈ సందర్భంగా మంటలు చెలరేగి కారు తగలబడిపోయిందని ఒక్లహోమా హైవే పోలీసుల ప్రతినిధి కెప్టెన్ క్రిస్ వెస్ట్ తెలిపారు. మృతులను సుబ్బయ్యగారి జశ్వంత్ రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతాటి అనురాగ్, రావికంటి శ్రీనివాస్, వెంకట్గా గుర్తించినట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) తెలిపింది. వీరిలో వెంకట్ ఒక్కరే వివాహితుడని వివరించింది. మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించి.. మృతదేహాలను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘తానా’ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వివరించారు. అనురాగ్ కెంటకీలో నివసిస్తుండగా.. మిగతా నలుగురూ ఒక్లహోమా నగరంలో ఉంటున్నారని చెప్పారు. మృతుల్లో ఫణీంద్ర ఖమ్మం జిల్లా వాసి కాగా.. రావికంటి శ్రీనివాస్ స్వస్థలం క రీంనగర్ జిల్లా గోదావరిఖని. జశ్వంత్ రెడ్డి కడపవాసి. అనురాగ్, వెంకట్ హైదరాబాద్కు చెందినవారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment