Tuesday, August 7, 2012

ఉప రాష్ట్రపతిగా తిరిగి హమిద్ అన్సారీ : ఓటింగ్ కు 47 మంది ఎంపీలు దూరం

న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్థి హమిద్ అన్సారీ మరోసారి ఎన్నికయ్యారు. ఆయనకు 490 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్ కు 238 ఓట్లు దక్కించుకున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 787 మంది సభ్యులున్నారు. 47 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాలు నుంచి 11 మంది, బీజేడీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 11 మంది ఎంపీలు ఓటు వేయలేదు. బీజేపీ, ఏజీపీ, ఆరెఎస్పీ, టీఆర్ఎస్ నుంచి ఇద్దరేసి ఓటింగ్ లో పాల్గొనలేదు. జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...