Friday, August 31, 2012

ఓజాకు 4 వికెట్లు: తొలిరోజు న్యూజిలాండ్ 328/6

 బెంగుళూరు, ఆగస్ట్ 31:  బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో శుక్రవారం మొదలైన  రెండవ టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజున 81.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ రాస్ టేలర్   సెంచరీ (113)  చేశాడు. బారత స్పిన్నర్ ఓజా 4 వికెట్లు తీసుకోగా.. రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.వాతావరణం సరిగా లేక  పోవడంతో మొదటి రోజున 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను నిలిపి వేశారు. ఈ సమయాన్ని కవర్ చేసేందుకు గాను  శనివారం అరగంట ముందు (ఉదయం 9 గంటలకు) ఆటను ప్రారంభించనున్నారు.  రెండు టెస్టు ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా తొలి టెస్టుని కైవసం చేసుకోని 1-0తో ఆధిక్యంలో  ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...