Thursday, August 23, 2012

హైదరాబాద్ టెస్ట్-తొలిరోజు భారత్ 307/5

ఛటేశ్వర్ పుజారా తొలి సెంచరీ
హైదరాబాద్:ఆగస్ట్ 23:  భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం ఇక్కడ మొదలైన  తొలి  టెస్ట్  లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 87 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు సాధించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో  ఓపెనర్  గంభీర్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బౌల్ట్ బౌలింగ్ లోఅవుటయ్యాడు. ,వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారాతో రెండో వికెట్ కు 28 పరుగులు జోడించిన అనంతరం.. 47 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బ్రేస్ వెల్ బౌలింగ్ లో సెహ్వాగ్ కూడా అవుటయ్యాడు. అనంతరం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కేవలం 19 పరుగులే చేసి బౌల్ట్ బౌలింగ్ లో బౌల్డ్ అవడంతో 125 పరుగులకే 3 ప్రధాన వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. ఈ సందర్భంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, పుజారాతో  సమన్వయం ప్రదర్శిస్తూ నాలుగో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని జతపరిచాడు. 58 పరుగులు చేసిన అనంతరం మార్టిన్ బౌలింగ్ లో కోహ్లీ అవుటవగా, తరువాత వచ్చిన రైనా కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. రైనా స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోనీ 29 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.  క్రీజులో ఉన్న పుజారా.. కెరీర్ లో తొలి శతకాన్ని పూర్తి చేసుకుని 119 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు., న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2, మార్టిన్, బ్రేస్ వెల్, పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...