బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాల వల్ల 1.86 లక్షల కోట్ల నష్టం
న్యూఢిల్లీ,ఆగస్ట్ 17: బొగ్గు కేటాయింపుల్లో తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.86 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిదని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) పేర్కొంది. పార్లమెంట్ ఉభయ సభల్లో కాగ్ నివేదికను శుక్రవారం ప్రవేశపెట్టారు. 2004 నుంచి 2009 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై కాగ్ ఈ నివేదిక సమర్పించింది. 2జీ కుంభకోణం కన్నా బొగ్గు కుంభకోణం పెద్దదని నివేదికలో అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయని నిర్థారించింది. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించదని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. టాటా గ్రూపు సంస్థలు, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అనిల్ అగర్వాల్ సంస్థలు, ఎస్సార్ గ్రూపు సంస్థలు, అదాని గ్రూపు, ఆర్సెలర్ మిట్టల్, ల్యాంకో సంస్థలు బొగ్గు కేటాయింపుల్లో బాగా ప్రయోజనం పొందాయని కాగ్ స్పష్టం చేసింది. మొత్తం 25 కంపెనీల జాబితాను కాగ్ ఇచ్చింది. అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయంపై కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. ఏడాదికి కేవలం 100 రూపాయల అద్దెతో 60 ఏళ్ల పాటు జీఎంఆర్కు భూమి కేటాయించారని కాగ్ చెప్పింది. దీనివల్ల ప్రభుత్వానికి 60 ఏళ్లలో లక్షా 63 వేల 557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం పోయిందని కాగ్ తేల్చింది.
న్యూఢిల్లీ,ఆగస్ట్ 17: బొగ్గు కేటాయింపుల్లో తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.86 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిదని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) పేర్కొంది. పార్లమెంట్ ఉభయ సభల్లో కాగ్ నివేదికను శుక్రవారం ప్రవేశపెట్టారు. 2004 నుంచి 2009 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై కాగ్ ఈ నివేదిక సమర్పించింది. 2జీ కుంభకోణం కన్నా బొగ్గు కుంభకోణం పెద్దదని నివేదికలో అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయని నిర్థారించింది. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించదని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. టాటా గ్రూపు సంస్థలు, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అనిల్ అగర్వాల్ సంస్థలు, ఎస్సార్ గ్రూపు సంస్థలు, అదాని గ్రూపు, ఆర్సెలర్ మిట్టల్, ల్యాంకో సంస్థలు బొగ్గు కేటాయింపుల్లో బాగా ప్రయోజనం పొందాయని కాగ్ స్పష్టం చేసింది. మొత్తం 25 కంపెనీల జాబితాను కాగ్ ఇచ్చింది. అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయంపై కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. ఏడాదికి కేవలం 100 రూపాయల అద్దెతో 60 ఏళ్ల పాటు జీఎంఆర్కు భూమి కేటాయించారని కాగ్ చెప్పింది. దీనివల్ల ప్రభుత్వానికి 60 ఏళ్లలో లక్షా 63 వేల 557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం పోయిందని కాగ్ తేల్చింది.
No comments:
Post a Comment