Friday, August 10, 2012

టీ-20 వరల్డ్ కప్‌ టీం లో యువరాజ్-న్యూజిలాండ్‌తో సిరీస్ కు లక్ష్మణ్...

ముంబై, ఆగస్ట్ 10:  క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. శ్రీలంకలో జరిగే టీ-20 క్రికెట్ వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో  యువరాజ్‌కు స్థానం దక్కింది. యువరాజ్ సింగ్ 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను క్రికెట్‌ కు దూరంగానే ఉన్నాడు. గతవారం ప్రాక్టీస్ గేమ్ ఆడాడు. బెంగళూర్‌లో అండర్ -19 ప్రపంచ కప్ ఆటగాళ్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో అతను బ్యాట్ పట్టాడు. లక్ష్మీపతి బాలాజీ, పియూష్ చావ్లాలతో పాటు స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లకు కూడా ట్వంటీ20 జట్టులో తిరిగి స్థానం లభించింది. జట్టు వివరాలు:  ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మనోజ్ తివారీ, జహీర్ ఖాన్, అశోక్ దిండా, ఆర్ అశ్విన్, పియూష్ చావ్లా, లక్ష్మీపతి బాలాజీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ.
న్యూజిలాండ్‌తో సిరీస్ కు లక్ష్మణ్...
న్యూజిలాండ్‌తో స్వదేశంలో  జరిగే టెస్టు సిరీస్‌ల్లో మొదటి రెండు టెస్టులకు కూడా సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్  ఈ నెల 23వ తేదీన హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 31వ తేదీ నుంచి చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.  భారత జట్టు వివరాలు : ఎంఎస్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, అజంకియా రహనే, పియూష్ చావ్లా, విరాట్ కోహ్లీ, వివియస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, ఆర్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, ఛతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...