Wednesday, August 1, 2012

ఈ నెల 14 వరకు జగన్ రిమాండ్ పొడిగింపు...

హైదరాబాద్, ఆగస్ట్ 1: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ కేసులలోని నిందితులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి, వారందరికీ ఈ నెల 14వ తేది వరకు రిమాండ్ పొడిగించింది. ఈ మూడు కేసులలో అరెస్టైన జగన్‌ను, నిమ్మగడ్డ ప్రసాద్‌ను, మోపిదేవి వెంకటరమణను, గాలి జనార్ధన్ రెడ్డిని, విజయ రాఘవను తదితరులను కోర్టు విచారించింది. ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మీ మాత్రమే కోర్టు విచారించలేదు. మిగిలిన అందరినీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి 14 వరకు రిమాండును పొడిగించింది.  జగన్ గత మే 27వ తేదిన అరెస్టు కాగా,  గాలి గత సంవత్సరం అరెస్టయ్యారు. అప్పటి నుండి ఈ కేసులలో వరుసగా నిందితులు అరెస్టవుతున్నారు. ఈ మూడు కేసులలోనూ సిబిఐ ఇప్పటికే కోర్టులో పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...