Sunday, July 29, 2012

జ్వాల- దిజు జోడీ ఓటమి

లండన్,, జులై 28:  ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మిక్సెడ్  డబుల్స్ లో జ్వాల- దిజు జోడీ ఓటమి పాలయ్యారు. ఆదివారం జరిగిన పోటీలో 12-21, 16-21 తేడాతో డెన్మార్క్ జోడీ రిటర్ - లేబౌర్న్ చేతిలో  వారు పరాజయాన్ని చవి చూశారు.
సానియా జోడి అవుట్
టెన్నిస్ డబుల్స్ లో సానియా మీర్జా, రష్మి చక్రవర్తి జోడి నిష్క్రమించింది. చైనీస్‌ తైపీ జంట జంగ్‌ చుయాంగ్‌, సూ చేతిలో 6-1, 3-6, 6-1 తేడాతో సానియా జోడి ఓటమి పాలైంది. వింబుల్డెన్‌ గ్రాస్‌ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌ 91 నిముషాలు సాగింది. రెండో సెట్‌ పోరాడినా... మూడో సెట్‌లో సానియా జోడి చేతులెత్తేసింది.
 ఆర్చరీ జట్టుకు నిరాశ
భారత మహిళల ఆర్చరీ జట్టుకు ఒలింపిక్స్ లో నిరాశే ఎదురయింది. లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన టీమ్ ఈవెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో భారత టీమ్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. దీపికా కుమారి, బొంబేలా దేవి, సువురో చక్రవోలులతో కూడిన భారత్ టీమ్ 210 పాయింట్లు సాధించగా డెన్మార్క్ ఆర్చర్లు 211 పాయింట్లు గెల్చుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...